Monday, July 20, 2009

పాట మినహా పూర్తయిన 'సై ఆట'



ఛార్మి ప్రధాన పాత్రలో ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నల్లూరి రాజశేఖర్‌ నిర్మిస్తున్న 'సై ఆట' చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. ఈ చిత్రానికి పవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్ర విశేషాలను నిర్మాత వివరిస్తూ ' ఇటీవల ఛార్మి, కొంతమంది బాలనటులు, 60 మంది డాన్సర్లు పాల్గొనగా మొఘల్‌ గార్డెన్స్‌లో వేసిన సెట్‌లో ఒక పాటను చిత్రీకరించాం. దీనికి ప్రేమ్‌రక్షిత్‌ నృత్యదర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రం ద్వారా కె.ఆర్‌.కె.పవన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యింది. ఈ పాటను ఓ ప్రముఖ హీరో-ఛార్మిలపై చిత్రీకరించ నున్నాం. ఆగస్టులో ఆడియోను విడుదల చేసి, సెప్టెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కోట శ్రీనివాసరావు, డాక్టర్‌ శివప్రసాద్‌, అజయ్‌, నాజర్‌, రావురమేష్‌, అలీ, యం.యస్‌.నారాయణ, మాస్టర్‌ భరత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: నందమూరి హరి, డాన్స్‌: ప్రేమ్క్ష్రిత్‌, మాటలు-పాటలు: భాషాశ్రీ, కెమెరా: జె.ప్రభాకర్‌రెడ్డి, నిర్వహణ: దేశినేని శ్రీనివాస్‌,

No comments: