Monday, July 20, 2009

రవితేజతో ప్రియమణి



తెలుగులో మరో మల్టీస్టారర్‌ చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. రవితేజ, అల్లరి నరేష్‌, సునీల్‌ కథానాయకులుగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఇందులో ప్రియమణి కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం.ప్రస్తుతం ‘ప్రవరాఖ్యుడు’లో వరూధిని పాత్ర పోషిస్తున్న ప్రియమణి తాజాగా రవితేజ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుందని తెలుస్తోంది. తమిళంలో ఇటీవలే విడుదలై.. ఘన విజయం సాధించే దిశగా పయనిస్తున్న ‘నాడోడిగల్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు బెల్లంకొండ సురేష్‌ సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన దర్శకుడితోనే తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించేలా బెల్లంకొండ ఒప్పందం చేసుకున్నారని, ఈ చిత్రంలో హీరోగా రవితేజను, మరో హీరోగా అల్లరి నరేష్‌ను, హీరోయిన్‌గా ప్రియమణిని ఎంపిక చేసుకున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల భోగట్టా!

No comments: